సిరిసిల్ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

– సిరిసిల్లలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు
– పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో


– సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30 (నేటి ధాత్రి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మే 3న పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. స్థానిక పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో మే 3న మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి వెల్లడించారు.
ఈ మేరకు మంగళవారం బహిరంగ సభ స్థలి ప్రాంగణాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తున్నారు. ఇందు కోసం భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి పరిశీలన అనంతరం కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ ఎత్తున సిరిసిల్ల నియోజకవర్గం నుండి జనాన్ని, పార్టీ శ్రేణులను, శ్రేయోభిలాషులను తరలించి సభను విజయవంతం చేయడం కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత మందిని ప్రజల్ని తరలించాలో, పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించడానికి సమాలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చెయ్యాలని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సభ ప్రాంగణం పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, వైద్య శివప్రసాద్,కాముని నళినికాంత్, మ్యాన ప్రసాద్, అకునూరి బాలరాజు, వెలుముల తిరుపతిరెడ్డి, యేల్లే లక్ష్మినారాయణ, నేరెళ్ల శ్రీకాంత్,వేముల రవి, గుండ్లపెల్లి గౌతమ్, కుడిక్యాల రవి, రెడ్డి నాయక్, వెంగళ లక్ష్మీ నరసయ్య, బైరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!