పంట అవశేషాల నిర్వ హణ పై అవగాహన
పర్యావరణాన్ని,సారవంతం కాపాడండి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం హుస్సే న్ పల్లి గ్రామంలో రైతు ముంగి ట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని పంట అవ శేషాల నిర్వహణ, నేల సార సంరక్షణ, పర్యావరణ పరి రక్షణపై అవగాహన కల్పిం చారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ డా. బి. విద్యాధర్ ,మండల వ్యవ సాయ అధికారి ప్రియదర్శిని మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్న పంటల కోతల అనంతరం రైతులు పంట అవశేషాలను తగులబెట్ట కుండా, వాటిని నేలలో కలిపి భూమి సారాన్ని పెంచుకోవా లని సూచించారు.పంట అవ శేషాలను కాల్చడం వల్ల నేల లోని సేంద్రియ కార్బ న్ తగ్గిపో వడం, సూక్ష్మజీవుల నష్టం, పోషకాల హ్రాసం జరుగుతుం దని తెలిపారు. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, గంధకం వంటి ముఖ్య పోష కాలు నష్టపోతాయని వివరిం చారు.పంట అవశేషాలను త్వరగా కుళ్లించేందుకు ఎస్ ఎస్ పి యూరియా పద్ధతి, పూసా డీకంపోజర్, ఎన్ సి ఓ ఎఫ్ ఘాజియాబాద్ వేస్ట్ డీకం పోజర్ మరియు ట్రైకోడెర్మా వంటి జీవ డీకంపోజర్ల విని యోగంపై రైతులకు ప్రయోగిక సూచన లు అందించారు.డా బి.సిద్ధార్థ్ నాయక్, టీచింగ్ అసోసియేట్ మాట్లాడుతూ రైతులు పంట అవశేషాల దహనాన్ని పూర్తిగా నివా రించి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించా లని కోరారు. ఏఈఓ జ్యోత్స్న కూడా రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సాంకేతిక సహాయంపై వివరిం చారు.ప్రజ్వల్ ఎన్జీఓ ఫీల్డ్ ఆఫీసర్ భానుమతి గ్రామ స్థాయిలో రైతులకు నిరంతర మార్గదర్శకత్వం అందిస్తు న్నట్లు తెలిపారు. గ్రామ సర్పం చ్ సుధాకర్ రావు రైతులు శాస్త్రవేత్తల సూచన లను ఆచరణలో పెట్టి గ్రామాన్ని ఆదర్శ వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చా రు.ఈ కార్యక్రమంలో రైతులు, వరంగల్ వ్యవసాయ కళాశా ల విద్యార్థులు నవ్య, శైలు పాల్గొన్నారు
