అంగన్వాడి కేంద్రంలో వైద్య పరీక్షలు, సీజనల్ వ్యాధులపై అవగాహన

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని నర్సక్కపల్లె గ్రామం అంబేద్కర్ కాలనీ ఆర్ బి ఎస్ కే పరకాల బి టీం హనుమకొండ జిల్లా కేంద్రం నుండివచ్చిఅంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రంలో బాల బాలికలకు వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు చిన్న పిల్లలకు సీజనల్ వ్యాధులు మరియు వారికి వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు పుట్టుకతో కలిగే అంగవైకల్యాలు పోషకాహార లోపంతో కలిగే ఇబ్బందులను తగ్గించుట కొరకు సూచనలు చేశారు అంగన్వాడీ సెంటర్లలో లభించే బాలామృతం పాలు గుడ్లు ఆహారమును చిన్న పిల్లలు తీసుకుంటూ అంగన్వాడి సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు గర్భిణీ బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో భోజనం,కోడిగుడ్లు తిని పాలు త్రాగి సరైన పోషణతో ఉండే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలని తెలియజేశారు. చిన్నపిల్లలకు ప్రతినెల టీకాలను తప్పకుండా వేయించాలని,వ్యాధి నిరోధకతను పెంచుకోవాలని తెలియజేశారు ఇట్టి వైద్య బృందంలో డాక్టర్ రవీందర్, డాక్టర్ సంధ్యారాణి,కవిత ఏఎన్ఎం,బోసు బాబు, ఫార్మసిస్ట్ అంగన్వాడీ టీచర్స్ కోడెపాక సుప్రియ,ఆయా జన్ను వనజ, పిల్లలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!