రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని అశోక్ నగర్ ఏరియా కు చెందిన ఆటో డ్రైవర్ రాజబాబు డిసెంబర్ 14న అనారోగ్యంతో మృతి చెందడంతో పట్టణ ఆటో డ్రైవర్ యూనియన్ సంఘం స్పందించి కుటుంబానికి ఆర్థిక చేయూతనందించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ బాబు కుటుంబ సభ్యులను ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు ఎనగంటి సంపత్ లు సందర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మృతి చెందిన ఆటో డ్రైవర్ రాజబాబు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందించేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు పాక అంజయ్య, జనరల్ సెక్రెటరీలు రవి ,రాజిరెడ్డి, కోశాధికారి కున్సోత్ సీతారాం, చెన్నాల సారయ్య, సభ్యులు నరసయ్య, శంకర్ ,రాజు, భాస్కర్ ,అంజయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.