శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవం హాజరైన మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం నాగిరెడ్డి పల్లి లో జరుగుతున్న శ్రీ దుర్గా భవాని మాత జాతర ఉత్సవాలకు మాజీ మంత్రులు హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డి గారు,స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గార్లతో తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప ,రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి,ఆలయ కమిటీ , గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.