ప్రజా వాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి .
చిట్యాల, నేటిధాత్రి :
బుధవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు దూడపాక సాంబయ్య అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు కనకం తిరుపతి లు* మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పలు సమస్యలు గ్రామాల్లో ఉన్నాయన్నాయని వాటి పరిష్కారానికి మండలలో నిర్వహించే ప్రజా వాణి లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిన ప్రకారం గత సోమవారం 17న దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఇంతవరకు వాటిని పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు. గత సోమవారం రోజున చిట్యాల లో నిర్వహించిన ప్రజా వాణి కి 4 దరఖాస్తులు* వచ్చాయని వాటితో పాటు ఈ సోమవారం ప్రజా వాణి కి కూడ కొన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పారు .గత ప్రజా వాణి లో చిట్యాల మండల కేంద్రంలోని దళితులకు ఇండ్ల స్థలాల పట్టాలు* ఇచ్చిన 5 ఎకరాల భూమికి హద్దులు* సరి చేయాలని ఇచ్చిన దరఖాస్తు తో పాటు మిగిలిన దరఖాస్తులను వెంటనే *జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గత సోమవారం రోజున దరఖాస్తులతో పాటు ఈ సోమవారం రోజున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.