మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
పట్టణానికి తాను చేసిన అభివృద్దే ప్రధాన అస్త్రంగా జడ్చర్ల పట్టణం 21వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది,వాడ వాడలా గులాబీ జెండా రెపరెపలాడంది.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు,చేపట్టిన అభివృద్ధి గురించి వివరిస్తూ జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల్లో 30 తారీకు రోజు ఈవీయం పై రొండో నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి జడ్చర్ల నుండి భారీ మెజారిటీ ఇచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ది చేసుకుందామని తెలిపారు.