
Excise Raids on Gudumba in Nallabelli
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్న రావు ఆదేశాల మేరకు నాటు సారా నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారం నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట జంట గ్రామాలలో నాటుసార స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని.ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 1900 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని వరంగల్ రూరల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ మురళీధర్ పేర్కొన్నారు. ఈ దాడులలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, వరంగల్ రూరల్ టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగయ్య, ఎస్సైలు రమ, శిరీష, స్థానిక ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు