ప్రసవానికి వస్తే ప్రాణాలు కోల్పోయింది.

Sri Sai Private Hospital Sri Sai Private Hospital

ప్రసవానికి వస్తే.. ప్రాణాలు కోల్పోయింది.

కల్వకుర్తి / నేటిదాత్రి :

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం కేంద్రంలో వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన రేణుక (27) కల్వకుర్తి లోని శ్రీ సాయి ప్రైవేట్ హాస్పిటల్ లో స్కానింగ్ చేయించుకొని వాటి రిపోర్ట్స్ డాక్టర్ కు చూపించగా.. రక్తం తక్కువగా ఉన్నదని.. ఆపరేషన్ చేయాలని బాధితులకు చెప్పగా.. వెంటనే ఆపరేషన్ చేశారు. పాప బానే ఉంది. ఆమెకు బ్లడ్ తక్కువగా ఉన్నది కావున నాగర్ కర్నూలు వెళ్లి బ్లడ్ తీసుకురమ్మని చెప్పాగా.. ఆదివారం సాయంత్రం బాధితులు నాగర్ కర్నూల్ కి వెళ్లి బ్లడ్ తీసుకొని రాగా.. ఇంతకు చాలా రక్తస్రావము కావున రక్తం ఎక్కించాలన్నారు.

Sri Sai Private Hospital
Sri Sai Private Hospital

మూత్రం బందవడంతో ఐసి లో ఉంచి వాళ్లను చూడనివ్వకుండా వాళ్లు కొద్దిసేపటి తర్వాత వచ్చి హాస్పిటల్ యజమాని తీసుకొని వచ్చి మలక్పేట లోని యశోద హాస్పిటల్ చేరిపించి రెండు లక్షలు నగదు అడగగా టెస్టులు చేసి మొత్తం లక్ష రూపాయలు కడతమని చెప్పారు ఒక లక్ష రేపు కడతామని చెప్పారు 80000 శ్రీ సాయి హాస్పిటల్ డాక్టర్ కట్టడం జరిగిందని అప్పుడు వారు హాస్పిటల్ లో జాయిన్ చేసుకొని ఇబ్బందికరంగా ఉంది సీరియస్ గా ఉంది మేము ఏమి చెప్పలేమని 48 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని చెప్పారు అప్పటికే కళ్ళకు టేపులు వేయడం జరిగిందన్నారు. శ్రీ సాయి హాస్పిటల్ యజమాన్యం అంబులెన్స్ మాట్లాడే వెంబడి రావడమే కాక.. తన సొంత సొమ్ముతో వైద్యానికి ఇచ్చాడన్నారు. ఇది ఇక్కడే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. లేకపోతే తను రిఫర్ చేయలే కానీ.. అక్కడి వరకు వెంబడి వచ్చి అంబులెన్స్ మాట్లాడి డబ్బుల సహాయం చేసి ఎవరూ చేయరు ఇలాంటి హాస్పిటల్ కు అనుమతి ఇచ్చిన యజమాన్యం పట్టించుకోని వీటిని సీజ్ చేయాలని బాధితులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!