*ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సింగ్ డే*
*పరకాల,నేటిధాత్రి*
అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మంగళవారం నర్సింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి ఆసుపత్రి సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,వైద్యులు,నర్సింగ్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్ మాట్లాడుతూ రోగుల సేవలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని,వారి సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నర్సులు అందించే సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు బాలకృష్ణ,మహేష్,హారిక, సంగీత,నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి,హెడ్ నర్సులు నాగమణి,ప్రసన్న, శారద,జ్యోతి,రజని,స్టాఫ్ నర్సులు భాగ్యలక్ష్మి,స్వాతి, సుప్రజ,సునీత,సుమలత,సుధా,రాణి తదితరులు పాల్గొన్నారు.
