*నిత్య జీవితంలో యోగా,ధ్యానం భాగం కావాలి*
*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా, మెడిటేషన్ కార్యక్రమం*
*పరకాల,నేటిధాత్రి*
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో యోగా మరియు మెడిటేషన్పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఆయుష్ మిషన్కు చెందిన యోగ గురువు బోగా రఘుపతి హాజరై విద్యార్థులు,అధ్యాపకులతో కలిసి యోగాసనాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బోగా రఘుపతి మాట్లాడుతూ నిత్యజీవితంలో యోగా ప్రతి ఒక్కరికీ అవసరమని,ఆరోగ్యవంతమైన జీవితానికి యోగాసనాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని విద్యార్థులకు సూచించారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ సంకల్పంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని అన్నారు.యోగా,ధ్యానం ద్వారా మానసిక ఉల్లాసం,ఏకాగ్రత,స్థైర్యం పెరుగుతాయని తెలిపారు.విద్యతో పాటు వారంలో రెండు రోజులు కళాశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య,ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ రెడ్డి,స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎలిషాల అశోక్,డాక్టర్ జి.పావని, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి.రాజేశ్వర్ కుమార్,అధ్యాపకులు డాక్టర్ భీమ్ రావు,బి.మహేంద్రరావు,డాక్టర్ ఆడెపు రమేష్,డాక్టర్ కే. జగదీష్ బాబు,ఏం.సమ్మయ్య,ఆర్.ఈశ్వరయ్య,ఎస్.రాజశ్రీ,డాక్టర్ డి. సంజయ్ కుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆఫీస్ సిబ్బంది వంశీ, కృష్ణ కూడా హాజరయ్యారు.
