ఘనంగా ఎస్టిపిపి డిస్పెన్సిరిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
జైపూర్,నేటి ధాత్రి:
ఎస్టిపిపి లోని డిస్పెన్సరీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి ఈడి సిహెచ్.చిరంజీవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగలే (లేడీ విత్ ది లాంప్ ) జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.ఇది వైద్య రంగంలో ప్రాణాలను రక్షించే “దేవదూతలను” గౌరవించుకునే ప్రత్యేక రోజు అని కొనియాడారు.రోగులకు కేవలం మందులు ఇవ్వడమే కాకుండా ప్రేమతో,ఓర్పుతో,నిస్వార్థ సేవను అందిస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోసేది నర్సులు మాత్రమే అని తెలిపారు.ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలను వదిలి,రోగుల కోలుకోవడం కోసం నిరంతరం శ్రమించిన నర్సుల సేవలు అపారమైనవని పేర్కొన్నారు.వారు వైద్యులకు కుడిభుజంగా ఉంటూ ఆరోగ్య వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని తెలిపారు.అనంతరం అధికారులు ఫ్లోరెన్స్ నైటింగలే చిత్రపటానికి పూలమాలలు వేసి,కాండిల్స్ వెలిగించి,కేక్ కట్ చేశారు.అలాగే నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు రాజమణి, సీనియర్ స్టాఫ్ నర్సును ఉత్తమ స్టాఫ్ నర్సుగా ఎంపిక చేసి,ఈడి చిరంజీవి ప్రశంసా పత్రాన్ని అందించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి జీఎం ఎం. నరసింహరావు,జీఎం (పీసీఎస్ & ఓ అండ్ ఎం)ఎం.మదన్మోహన్, ఏజీఎం (పీసీఎస్)కే. సూర్యనారాయణ రాజు, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సత్యనారాయణ,సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి.పంతుల, మెడికల్ సూపరింటెండెంట్ బి. జానకి,ఎస్వో టు ఈడి వెంకటయ్య,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్, రిటైర్డ్ డా.ప్రభాకర్ తదితర అధికారులు,మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
