Kantha Maheshwara Idol Installation
కంఠ మహేశ్వరుని విగ్రహాల ప్రతిష్ఠాపన
నల్లబెల్లి, నేటిధాత్రి:
నల్లబెల్లి మండలంలోని బొల్లోనిపల్లిలో శ్రీ కంఠ మహేశ్వరుని ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కంఠ మహేశ్వర స్వామి, సూరమాంబ దేవి, రేణుక ఎల్లమ్మ, వనం మైసమ్మ, పోతరాజు విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది.ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకట్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటలకు ఆలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు. 9 గంటలకు గౌడ సభ్యులకు మాలధారణ చేశారు.విగ్రహదాతలు దివంగత తిప్పని యశోద, సాయిలు గౌడ్, వారి కుమారుడు తిప్పని రాజయ్య గౌడ్ జ్ఞాపకార్థం కుమారులు, కోడళ్లు తిప్పని విజయ – సాంబయ్య గౌడ్, తిప్పని లక్ష్మి – రవీందర్ గౌడ్, తిప్పని రజిత – మహేందర్ గౌడ్, తిప్పని సృజన – లింగమూర్తి గౌడ్ ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనిషి తిప్పని సాంబయ్య గౌడ్, సారకోల పెద్ద మనిషి మేడిపల్లి ప్రసాద్ గౌడ్, అధ్యక్షుడు కోటగిరి దేవేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గాజర్ల రాజు గౌడ్, కార్యదర్శి కోటగిరి రమేశ్, బోడిగే రాజు గౌడ్, బోడిగే సాంబయ్య గౌడ్, గాజర్ల రాంచంద్రు గౌడ్, గాజర్ల సారంగపాణి గౌడ్, తిప్పని సంపత్ గౌడ్, గట్టు సారయ్య గౌడ్, జక్కి రాములు గౌడ్, దేవేందర్ గౌడ్, పిడిమల్ల రాజేశ్ గౌడ్, స్వామి గౌడ్, సమ్మాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
