CI Ramesh Birthday Service
సీఐ ఒంటేరు రమేష్ జన్మదిన వేడుకలు
పేషెంట్లకు పండ్ల పంపిణీ
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని రాజీపేట ప్రాంత ప్రజలు ఈ రోజు సీఐ ఒంటేరు రమేష్ జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.జన్మదిన సందర్భంగా పరకాల సివిల్ ఆసుపత్రిలో డాక్టర్.అల్లే రాజు ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు అరటిపండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొచ్చు రాజు స్వేరో, బోట్ల నరేష్,గడ్డం రమేష్,ఏకు రఘుపతి,విక్రమ్,ఏకు బాబు, గోవిందా అజయ్,పోతుగంటి అర్జున్, ఎల్తూరి శ్రీనివాస్,ఒంటేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
