Indiramma Houses Inaugurated
ఇందిరమ్మ ఇల్లు పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక
* చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్
చేవెళ్ల, నేటిధాత్రి :
ఇందిరమ్మ ఇల్లు పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక అని చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలకేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకయ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఆయన లబ్ధిదారుల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మెచ్చి, ఆశీర్వదించిన ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ సేవ చేసే నేతలకు,ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ రానున్న ఎన్నికల్లో కూడ ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు నిరంతరం ఏళ్లవేళలా ప్రజల క్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి కృషి చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పెట్ మండలం అధ్యక్షులు వెంకటయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి , బి బ్లాక్ అధ్యక్షులు పోలీస్ మధుసూదన్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి , నవాబ్ పేట సర్పంచ్ నరసింహ రెడ్డి , యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ , యూత్ కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డి , మండల అధ్యకులు శేఖర్ , యాదయ్య , యావాపూర్ సర్పంచ్ లక్ష్మణ్ , పులుమామిడి సర్పంచ్ నరసింహులు, చించల్ పెట్ సర్పంచ్ అనంత రాములు , పాండు రంగా రెడ్డి , మాదిరెడ్డి పల్లి రాజు , మాజీ ఉప సర్పంచ్ సంగారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్ సీనియర్ నాయకులు , స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
