10 Special Buses for Mahashivaratri Devotees: RM Vijay Bhaskar
మహాశివరాత్రికి 10 ప్రత్యేక బస్సులు: ఆర్ఎం విజయ్ భాస్కర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఝరాసంగం క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్ డిపో నుంచి 10 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కూడా నడుపుతామని ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో రద్దీనిబట్టి బస్సులు నడుపుతామన్నారు,
