ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

మా ఊరికి ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనే మాకు ముఖ్యమని మందపల్లి గ్రామస్తులు ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో గురువారం నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని న్యూవిజన్‌ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రావడంతో ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామసర్పంచ్‌, పంచాయతీ వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మొగ్గం మహేందర్‌, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో హంగులు, ఆర్భాటాలు మాత్రమే ఉంటాయని, ఇక నుండి మా ఊరిలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాకూడదని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మూర్తి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, నాణ్యమైన బోధన అందించి విద్యార్థులను ఉన్నతస్థాయి స్థితిలో చేర్చే బాధ్యత తమదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *