తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…,

తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో సకాలంలో పనులు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐనవోలు మండలం ఏర్పాటైన నాటి నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు కాలేదంటూ ఒకరి తరువాత ఒకరుగా బదిలీపై వెళ్తున్నారన్నారు. ఈ విషయంపై ఆర్డీవోకి మొరపెట్టుకున్న పనులు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు కాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *