కమలాపూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. ఉదయం గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని పురవీధుల్లో డప్పు చప్పుళ్ళ మధ్య
శివ సత్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలకు క్షేమంగా ఉండాలని, వర్షాలు విస్తారంగా కురియాలని కోరుతూ చల్లంగ దీవించమ్మ అంటూ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ బోనాలు రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్దకు మంగళవారం రాత్రి భక్తి శ్రద్దలతో బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పబ్బు మల్లేష్ గౌడ్ ఉపాధ్యక్షులు జెరుపోతు లక్ష్మణ్ గౌడ్ క్యాషియర్ జక్కు కోటేశ్వర్ గౌడ్,సభ్యులు బాలసాని రవి గౌడ్, దేశిని పరలోకం గౌడ్, కూనురి రవిగౌడ్, పబ్బు ఎల్లా గౌడ్ పచ్చిమట్ల శీనివాష్ గౌడ్, మండ శ్రీనివాస గౌడ్, కుల పెద్దలు, పెద్ద ఎత్తున మహిళలు,తదితరులు పాల్గొన్నారు.