నీట్ పేపర్ లీక్ పై యువజన కాంగ్రెస్ ధర్నా
భూపాలపల్లి నేటిధాత్రి
నీట్ పేపర్ లీక్ ఫై జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని యువజన కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ మాట్లాడుతూ
“గత 10 సంవత్సరాల్లో వరుసగా(89సార్లు )జరుగుతున్న పేపర్ లీక్లు కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని …
విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలు, యువత భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోందని…
దేశంలో చదువుకునే విద్యార్థులకు భద్రత ఇవ్వలేని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయిందని” అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..
ఎన్ టిఏ స్వయంగా పేపర్ లీక్ జరిగినట్లు అంగీకరించి పరీక్షను రద్దు చేయడం దేశ విద్యా వ్యవస్థకు మచ్చ అని అన్నారు….
పేపర్ లీక్ మాఫియాకు అండగా నిలుస్తున్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచుల మహేశ్, రేగొండ మండల అధ్యక్షులు కోయిలా క్రాంతి చిట్యాల మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, శాయంపేట మండల అధ్యక్షులు సాదు నాగరాజు టేకుమట్ల మండల అధ్యక్షులు కొలుగూరి అనిల్ మొగుళ్ళపల్లి మండల ఉపాధ్యక్షులు మెరుగు సురేష్ గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు, బోయినీ మధుకర్,బొమ్మ కిరణ్, పున్నం ప్రవీణ్,కీర్తి రాజు, మేకల శివ,మహేశ్ , గట్టు కుమార్,నాగరాజు, నరేందర్ రెడ్డి, సుమన్, రాజకుమార్, సురేష్, శ్రీను, హరీష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు
