కారులో వార్… ఉద్యమకారులను పట్టించు కోని గండ్రరమణారెడ్డి వర్గం
జెండా ఎజెండా కింద పని చేస్తాం
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ప్రచన్నయుద్ధం జరుగుతుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఇద్దరు పెద్ద నాయకుల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రమణారెడ్డి వర్గం టిఆర్ఎస్ పార్టీ మండలంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మధుసూదనాచారి వర్గాన్ని పిలువక పోవడంతో చారి కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమనేత చారి గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య వాగ్దిత్వానికి దిగడం ఇందుకు నిదర్శనం. మొదటగా మేము కెసిఆర్, మధుసూదనా చారి టిఆర్ఎస్ జెండా పట్టుకుని ఉద్యమంలో తిరగడం జరిగింది. మేము బతికున్నంత కాలం కేసీఆర్ , మధుసూదనా చారి ఎజెండా కిందనే పనిచేస్తా మని అన్నారు.మా పార్టీలోకి వలసగా వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు మా ఉద్యమ కారులను పట్టించుకోకపోవడం దీనిపై అధిష్టానాన్ని తెలియ పరచడం కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతుండడం జరుగుతుంది. ముఖ్యంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి కమిటీలు, యూత్ కమిటీలు నిర్వహించి న కూడా ప్రాధాన్యత కల్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

ఈనెల 27 బీఆర్ఎస్ రజ తోత్సవ సభను విజయవంతం చేద్దామని అన్నారు. ప్రతి గ్రామం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు,ప్రజలు లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం కోసం మండల ఉద్యమ నాయకులు అందరూ కంకణం కట్టుకున్నా రు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ పొడిశెట్టిగణేష్, మండల అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి రవీందర్,సీనియర్ ఉద్యమ కారుల నాయకులు బలిజే నరసింహారావులు,వికలాం గుల రాష్ట్ర నాయకులు గజ్జి శంకర్ ,మాజీ యూత్ మండల అధ్యక్షులు నాగరాజు, బెరుగు తరుణ్ గోపి, కొత్తగట్టు సాయి, ముంజలా నాగరాజు,గాదె రాజేందర్,రాజు మహ్మద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.