Nadigoti Ramu Visits Patala Swetha Varahi Temple
* పాతాళ శ్వేత వారాహి అమ్మవారిని దర్శించుకున్న
-కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము
మొగుళ్లపల్లి నేటి దాత్రి
ముక్కోటి హిందూ దేవుళ్ళ అనుగ్రహం మొగుళ్లపల్లి మండల ప్రజలపై ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ఆ దేవుళ్లను వేడుకున్నారు. నడిగోటి రాము నేతృత్వంలో మొగుళ్లపల్లి గ్రామంలోని యువకులు ఆ ఏడుకొండలవాడి దర్శనంలో భాగంగా మంగాపురం తిరుపతిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, రామచంద్రపురం రాయల చెరువు ఓడ్డున పాతాళ అడుగులోని అష్టదశ శక్తి పీఠాలలో 5వ పీఠం అయినటువంటి పాతాళ శ్వేత వారాహి అమ్మవారి దేవాలయాన్ని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నడిగోటి రాము మాట్లాడారు. ఆ ముక్కోటి దేవుళ్ళ అనుగ్రహం మొగుళ్లపల్లి మండల ప్రజలపై ఉండాలని, కాంగ్రెస్ ప్రజాపాలనలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు చేరి, తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆశీస్సులతో..మొగుళ్లపల్లి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఆ దేవుళ్ళ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో, కుటుంబంతో కలిసి మెలిసి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి రిపోర్టర్ వడ్లకొండ పవన్ గౌడ్, పుట్ట అజయ్, బత్తిని రాజు గౌడ్, సూర్నేని మణికర్, బూర ప్రకాష్ తదితరులున్నారు.a
