ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వద్దిరాజు

న్యూఢిల్లీ, ఆగస్ట్, 6:

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం తన ఓటు వేసారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మొదటి సమావేశంలోనే తనకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *