టీజేఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం.

# పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్

నర్సంపేట,నేటిధాత్రి :

తెలంగాణ జన సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ సూచన మేరకు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభం చేశామని, ప్రజాస్వామ్య పరిరక్షణ సామాజిక న్యాయం కోసమే జనసమితి బాట అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సంపన్న వర్గాలు, అన్ని పార్టీలు ఏకమై ప్రొఫెసర్ కోదండరాం సార్ కు ఉద్యమ పగ్గాలు సార్ చేతిలో పెడితే తండ్రి పాత్ర పోషించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, ఎలిశాల రాజేష్, ఎండి సంధాని, సోల్తి సాయికుమార్, దోమ రమేష్, సాంబరాతి మల్లేశం, గుంటి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *