Neglect Of Vaikuntha Ratham Raises Concern
వైకుంఠ రథాన్ని పట్టించుకోని మల్యాల పాలకవర్గం
చందుర్తి, నేటిధాత్రి :
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూపు వారు మల్యాల గ్రామానికి ఇటీవల వైకుంఠ రథాన్ని అందజేశారు దాన్ని దుబాయ్ అభివృద్ధి కమిటీ గ్రూపు వారు మల్యాల గ్రామపంచాయతీ పాలకవర్గానికి అప్పజెప్పగా దీన్ని పట్టించుకునే నాధుడే లేడు గత కొద్దిరోజుల క్రితం దుబాయ్ గ్రూపు వారు గ్రామపంచాయతీ పాలకవర్గానికి అప్పజెప్పడం జరిగింది కానీ వారు వైకుంఠ రతాన్ని పట్టించుకోవడం లేదు. ఎండకెండుతుంది వానకు తడుస్తుంది అని దుబాయ్ గ్రూపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా దీనిపై చర్య తీసుకొని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు దీనికి రేకుల షెడ్ వేసి నిర్వహణ చేయాలని దుబాయ్ గ్రూప్ సభ్యులు పాలకవర్గాన్ని కోరుచున్నారు.
