Compensation Demand For Fire-Affected Farmers
అగ్ని ప్రమాదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి
ప్రతి మండలానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి
సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని వ్యవసాయ అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించి అరటి తోట మిరప మక్కలు కాలిపోయిన రైతులకు ప్రభుత్వ అధికారులు అండగా నిలిచి సమగ్రమైన సర్వే నిర్వహించి ప్రభుత్వం దిష్టికి తీసుకపోవాలని కోరుతున్నాం అగ్ని ప్రమాదంలో చనిపోయిన రేపాక పల్లెదంపతులకు 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రతి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని అగ్నిప్రమాదం నుంచి కాపాడాలని కోరుతున్నాం నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను రైతుల ఆదుకోవాలని కోరుతున్నాం . ఈ సమావేశంలో నాయకులు బంధు క్రాంతి సుజాత ఆత్కూరిశ్రీకాంత్ స్వాతి పాల్గొన్నారు
