Goti Thalambralu Offered to Bhadrachala Ramayya
పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తీసుకు రావాలని చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మహిళ పారిశుధ్య సిబ్బందికి సన్మానం చేసి , వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి మాట్లాడుతూ మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పారిశుధ్య కార్యక్రమాలు మంచిగా చేసి, మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ చంద్ర శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
