ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా.

ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా…

రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బిఆర్ఎస్…

రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులది…

నీళ్ళివ్వకుండ చెక్ డ్యామ్ కులగొట్టిన ఘనత మన ప్రస్తుత ఎమ్మెల్యే ది..

ఏప్రిల్ 27న జరగబోయే మన సభా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకు రానుంది…

:-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో భాగంగా నేడు మొగుళ్ళపల్లి మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్,కొరికిశాల ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ సందర్భంగా ఆకినపల్లి మాజీ సర్పంచ్ దూడపాక భద్రయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడపాక సమ్మయ్య మరియు యువత అబద్దాల కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే రమణన్న సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే రమణన్న మాట్లాడుతూ…

2001 ఏప్రిల్ 27 వ తారీఖు నాడు కెసిఆర్ గారు ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటువంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ ఆరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం. భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించలేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవా సభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు.

BRS party

 

 

ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటువంటి ప్రభుత్వాలు ఉండవు,దానికి కారణమేంటంటే అమలు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తున్నటువంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు.

ఈరోజు ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపాలన, అసమర్ధ పరిపాలన, చేతగాని వ్యవహారం ఇవన్నీ చేసుకుంటు ఈరోజు ప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.

ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండానే, గెలిచేది బిఆర్ఎస్ అభ్యర్దులే…

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి.

కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version