ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్, నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమ్మ సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రామండ్లపెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!