తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం…

 తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు అధినేత పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దామని మార్గనిర్దేశం చేశారు. కనీసం ఏపీ వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.

కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలో మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటింటి వస్తువుల ధరలు తగ్గుతాయని వివరించారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులకు కూడా జీఎస్టీ తగ్గిందని… రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తుచేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ధి జరగుతోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.

కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

ప్యాలెస్‌లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్‌కి తెలుసు అని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. జగన్‌కి మానసిక పరిస్థితి బాలేదని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై, వైసీపీ డిజిటల్ బుక్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ లబ్ధి కోసమే దండయాత్ర చేయడం జగన్ నైజమని ఫైర్ అయ్యారు. ఇవాళ(ఆదివారం) అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి సత్య కుమార్.
ప్రజలపై దాడులు చేయడం తలకాయలు నరకడం, తలకాయలు తొక్కించటం, రప్ప రప్ప అనటం.. ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడటమే జగన్ వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. విష సంస్కృతిని అలవరుచుకున్న పార్టీ వైసీపీ అని ఆక్షేపించారు. వైసీపీ నేతలు బెదిరిస్తే ప్రజలు భయపడే వారు ఎవరూ లేరని హెచ్చరించారు. ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని ఎద్దేవా చేశారు మంత్రి సత్య కుమార్.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version