హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు…

హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు

 

హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ బుధవారం నాడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

 హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ.. బుధవారం నాడు నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘ఆది శంకరుల అద్వైతం. నేను పరమాత్మను నమ్ముతాను. హిందుత్వం అనేది ఒక ధర్మం. ఇది జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఈ పుణ్య భూమిలో పుట్టిన ప్రతిఒక్కరూ హిందువే. నా ధర్మాన్ని గౌరవిస్తూ.. ఇతరులను కించపరచకుండా బతుకుతాను. అలానే అర్చకుల జీతభత్యాల గురించి నేను శాసనమండలిలో మాట్లాడాను’ అని నాగబాబు తెలిపారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణ ఘటనలను నాగబాబు ప్రస్తావించారు. ‘2020 సెప్టెంబర్ 6న అంతర్వేది రథం దగ్ధమైన రోజు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఉద్యమాలకు తలొగ్గి కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పింది. 2023లో ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే.. అంతర్వేది కేసును అసలు తాము విచారణ చేయలేదని సీబీఐ వివరించింది. అంటే వైసీపీ నేతలు చేసిన ప్రకటనను అమలు చేయకుండా మోసం చేశారని తేలిపోయింది. మసి పూసి మారేడు కాయ చేయడంలో నిపుణులైన వైసీపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడరు. అవతలి వారి వ్యక్తిగత జీవితాలపై వారికి ఉన్న ఆసక్తి.. హిందూ ఆలయాలపై ఎందుకు ఉంటుంది. రామతీర్ధం రాముడు మనకు దైవం.. డిసెంబర్ 2020లో రాముడు తల నరికినా వైసీపీ ప్రభుత్వంలో చర్యలు లేవు. నామ్ కే వాస్త్‌గా కేసులు పెట్టి.. చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో దోషులను శిక్షించలేదు. మీరు, మీ మంత్రులకు ఇతర వ్యక్తుల సినిమాలపై రివ్యూలు ఇచ్చే శ్రద్ధ రాముడిపై ఎందుకు ఉంటుంది’ అని ఆయన అన్నారు.

‘అయోధ్యలో రామమందిరం కల సాకారం అయితే.. చంద్రబాబు, పవన్ వెళ్లి పాలు పంచుకున్నారు. నేడు హిందువులపై ఎక్కడ లేని ప్రేమ వలక పోస్తున్న ఆ నాయకుడు అయోధ్యపై ఒక్క పోస్టు అయినా పెట్టారా?. వెళ్లలేక పోయినా కనీసం స్పందిస్తూ.. ప్రకటన అయినా విడుదల చేశారా?. పేదల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోవాలని చూస్తారు. అటువంటి కొండపై వసతుల ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇది సామాన్యులకు భగవంతుడిని దూరం చేయడం కాదా?. మాఫియా కోసం పేద ప్రజలను వెంకన్న స్వామికి అందకుండా చేస్తారా?. కూరగాయలు బేరమాడినట్లు సేవల పెంపులో వైసీపీ నేత సుబ్బారెడ్డి బేరం ఆడిన విధానం అందరూ చూశారు. తిరుమలపై నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు.. టీటీడీ కామన్ గుడ్ ఫండ్ ఇచ్చే కంట్రిబ్యూషన్ రూ.2.50 కోట్లు ఉండేది.. రూ.50 కోట్లకు ఒకేసారి పెంచేశావు’ అని నాగబాబు విమర్శించారు.

‘తిరుపతిలోనే కాదు.. ఎక్కడ కొండ కనిపించినా గుండు కొట్టేయడమే మీకు అలవాటు. డిక్లరేషన్ ను గౌరవించడం మన సంప్రదాయం. అయినా బాధ్యత గురించి వైసీపీ నేతలకు చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లే. పవన్ కల్యాణ్ తన సతీమణి, పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అలానే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం కంటే నువ్వు గొప్పోడివా.. నీ మంత్రి వచ్చి తిరుమల నీ అమ్మ మొగుడు కట్టాడా అంటాడా..?. అలా తలపొగరుతో మాట్లాడినందుకే 151 మధ్యలో 5 తీసేసి 11 సీట్లే ఇచ్చారు. అయినా నువ్వేమైనా మారావా.. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన మానుకున్న చరిత్ర నీది. సెక్యులర్, రిలీజియస్ ప్లేస్‌లకు తేడా తెలియని వ్యక్తివి నువ్వు. తిరుమల కల్తీ ఉదంతంలో అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ వైసీపీపై నాగబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్…

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్

 

కల్తీ నెయ్యి వ్యవహారంలో గత ప్రభుత్వంపై టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..

తిరుపతి, జనవరి 30: కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు (TTD Chairman BR Naidu) స్పందించారు. కల్తీ నెయ్యి కేసులో సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలు ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఒకరిద్దరికి లాభం చేకూర్చడం కోసం నిబంధనలు మార్చారని తెలిపారు. సామర్థ్యం లేని డెయిరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్‌ ఇచ్చి.. రూ.250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.
అది మహాపాపం…

చుక్క పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రశ్నించారు. ప్రాణాంతకమైన కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారని.. గత పాలకులు చేసింది మహా పాపమని అన్నారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు. నెయ్యిలో యానిమల్‌ ఫ్యాట్‌ ఉందని ఎన్‌డీడీబీ (NDDB) నివేదిక ఇచ్చిందని.. సిట్‌ నివేదికలో కూడా ఇదే ఉందన్నారు. గత పాలకమండలి చేసిన ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిళ్లు కూడా సిట్‌ నివేదికలో పెట్టారని తెలిపారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతా పథకం ప్రకారమే..

వైవీ సుబ్బారెడ్డి దంపతులు సీబీఐకి బ్యాంక్‌ ఖాతాలు ఇచ్చేందుకు నిరాకరించారని.. పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్ట దిగజార్చారని టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంటే ఒకరకంగా స్లో పాయిజన్ అని చెప్పారు. కాసుల కోసం కక్కుర్తి పడి భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారన్నారు. తనిఖీల్లో భోలేబాబా డెయిరీకి ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని తెలిపారు. చినప్పన్న ఎవరు?.. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదా? అని నిలదీశారు. అన్య మతస్తులు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారని.. వైసీపీ పెద్దల సహకారం లేకుండా ఇదంతా ఎలా చేస్తారని అడిగారు. హిందూ సమాజానికి జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

 తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం…

 తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు అధినేత పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దామని మార్గనిర్దేశం చేశారు. కనీసం ఏపీ వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.

కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలో మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటింటి వస్తువుల ధరలు తగ్గుతాయని వివరించారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులకు కూడా జీఎస్టీ తగ్గిందని… రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తుచేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ధి జరగుతోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.

కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

ప్యాలెస్‌లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్‌కి తెలుసు అని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. జగన్‌కి మానసిక పరిస్థితి బాలేదని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై, వైసీపీ డిజిటల్ బుక్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ లబ్ధి కోసమే దండయాత్ర చేయడం జగన్ నైజమని ఫైర్ అయ్యారు. ఇవాళ(ఆదివారం) అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి సత్య కుమార్.
ప్రజలపై దాడులు చేయడం తలకాయలు నరకడం, తలకాయలు తొక్కించటం, రప్ప రప్ప అనటం.. ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడటమే జగన్ వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. విష సంస్కృతిని అలవరుచుకున్న పార్టీ వైసీపీ అని ఆక్షేపించారు. వైసీపీ నేతలు బెదిరిస్తే ప్రజలు భయపడే వారు ఎవరూ లేరని హెచ్చరించారు. ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని ఎద్దేవా చేశారు మంత్రి సత్య కుమార్.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version