చేనిగేపల్లిలో భారీ వర్షం, ఈదురుగాలులతో బీభత్సం: విద్యుత్ సరఫరా నిలిచిపోయింది :
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చేనిగేపల్లి గ్రామంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వానతో బీభత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారిపై పడిపోయాయి, కొన్ని కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారిపై చెట్లు, విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన స్తంభాలు, చెట్లను తొలగించే పనులు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
