ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పద్దెనిమిదో వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించారు. పల్లె రాజు శ్రీదేవి పద్ధెనిమిధో వార్డ్ లో తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అశోక్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. 40 ఏండ్లు గా కాంగ్రెస్ పార్టీ లో కార్య కర్త గా కొనసాగుతున్న తనకు పద్ధెనిమిదవ వార్డ్ అభ్యర్ధి గా స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి బల పరచారని తెలిపారు. హస్తం గుర్తు కు ఓటు వేసి
బారి విజయం అందించాలని కోరారు.
