వృద్ధుల సంక్షేమ చట్టాలపై అవగాహన కల్పించి న్యాయం చేస్తాము…

వృద్ధుల సంక్షేమ చట్టాలపై అవగాహన కల్పించి న్యాయం చేస్తాము

వనపర్తి నేటిదాత్రి .

 

వృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించి న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ తెలిపారు.
మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబ ర్ లో వృద్ధులు సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సీనియర్ సిటిజన్స్ సమస్యలపై కమిటీ సభ్యులతో చర్చించారు. సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు సమాజంలో వృద్ధులు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై  పలు కీలక సూచనలను చేశారు సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకునే విధంగా సంరక్షించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ సభ్యులు సూచించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపై ఉందన్నారు. జిల్లాలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అట్టి సంవత్సరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. వృద్ధుల సమస్యలపై ఇప్పటి వరకు 127 ఫిర్యాదులు వచ్చాయని 65 పరిష్కరించామన్నారు ఈ సమావేశంలో డి.ఎస్.పి బాలాజీ నాయక్, డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, డి డబ్ల్యు ఓ సుధారాణి, ఆర్డీఏ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version