కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి..

కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి

ఉత్సవ కమిటీని ప్రకటన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవ కమిటీ ప్రకటన

ఈనెల 9 వరకు ఉత్సవ కమిటీకి జాతర బాధ్యతలు

నర్సంపేట /గీసుకొండ: నేటిధాత్రి:

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో గల కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. కమిటీ ఎంపిక ప్రకటనను జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో గల కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేడు 3 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవ కమిటీని ఎంపిక చేశారు.

ఈ నూతన ఉత్సవ కమిటీలో 14 మంది సభ్యుల పేర్లను ఎండోమెంట్ శాఖ ప్రకటించింది. ఈనెల 2 నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవ కమిటీలో వీరాటి రవీందర్ రెడ్డి,అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్నలను ప్రకటిస్తూ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ తో పాటు రాష్ట్ర,జిల్లా దేవాదాయ శాఖ, సంబంధిత శాఖలకు జీవో కాపీలతో ఆదేశించింది.

కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి

గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ జీవో జారీ చేయగా పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి ఉత్సవ కమిటీని ఎంపిక చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి, సభ్యులుగా అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్న పేర్లను కమిటీలో ప్రకటిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొమ్మాల జాతర ఉత్సవాలలో భక్తులకు ఇలాంటి కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు.

జాతరలో ఏలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు

శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఉత్సవాల నేపథ్యంలో జాతరకు వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి తెలిపారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు జాతర ఉత్సవ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

నేడు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం..

శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర హోలీ పండుగ రోజు నుండి 9 వ తేదీ వరకు వారం రోజులపాటు సాగే ఉత్సవాల నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు,ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు గాను చైర్మన్ తో పాటు 14 మంది సభ్యుల ఉత్సవ కమిటీని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ మంగళవారం దేవాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వినతిపత్రం ఇచ్చిన సర్పంచి సరిత…

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వినతిపత్రం ఇచ్చిన సర్పంచి సరిత

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గోదావరి తీరాన వెలసిన మల్లన్న దేవుని ఆలయానికి నిధులు మంజూరు చేసి ఆలయ నిర్మాణం చేపట్టాలని మద్దులపల్లి సర్పంచి సరిత, ఉపసర్పంచి లచ్చిరెడ్డి తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యారుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సానుకూలంగా స్పందించి దేవాదాయశాఖ డిఈ రమేష్ కు ఆలయానికి సంబంధించిన వివరాలు చూడాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచి సరిత తెలిపారు.

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్…

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్

◆:- కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి
ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెటర్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజారుద్దీన్, 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, 2009లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ఝరాసంగం గ్రామ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేశారు,

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్…

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకుని మొక్కులను సమర్పించిన బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శుక్రవారం హన్మకొండలోని రాంనగర్ లో గల మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారా..? లేదా అని మహేందర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. తమరి ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల అభివృద్ధి పనులు చక చకా జరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సంబంధించి ఎక్కువ నిధులను కేటాయించి..ప్రజలకు మెరుగైన వసతులతో పాటు..ప్రజలలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా..అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీపై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వేముల మహేందర్ గౌడ్ మంత్రి కొండా సురేఖకు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version