మా సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయి.

మా సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయి…

ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం… మహమూద్ పట్నం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

కేసముద్రం నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మహిళలకు అలాగే ప్రతి పేదవానికి లబ్ధి చెందేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిజమైన లబ్ధిదారులకే చెందేలా ఎంతో పటిష్టంగా అధికారులచే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలో ఇసం పెళ్లి సారమ్మ వైఫ్ ఆఫ్ మల్లేష్, సొంత ఇంటి కలను నిజం చేస్తూ వారి ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మిట్ట గడుపుల యాకు తొగరి నవీన్ మాజీ ఎంపిటిసి ముంజల శ్రీనివాస్ కాసు రాజేంద్ర చారి చిలువేరు శివాజీ పోలు శ్రీనివాస్ మొదలగువారు పాల్గొన్నారు.

ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే.

– ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ములకలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వో లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు.

కొరికిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.

అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు.

గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.

గుడిసే వాసుల కల నెరవేరేనా!

గుడిసే వాసుల కల నెరవేరేనా!

పేదలు వేసుకున్న గుడిసె లకు పట్టాలు లభించేనా!

శాయంపేట నేటిధాత్రి:

పేద ప్రజలకు సొంతింటి కలగానే మిగిలిపోతుందా ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టిన సొమ్ము లేదంటే బ్యాంకు ద్వారా ఇంటి జాగాలు కొనుగోలు చేస్తు న్నారు కానీ పేదలకు కొనుక్కునే స్తోమత లేక కష్టం వారికి జాగలుకొని ఇల్లు కట్టుకుని స్తోమత ఉంటుందా! అందువల్ల వారి సొంతింటి కలను నిజం చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవ డంతో శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములు గుడిసెలు వేసుకుని నిరీక్షణగా ఎదురుచూస్తున్న గుడిసె వాసుల ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక వసతులు లేకున్నా జీవనం కొనసాగిస్తున్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో పేదల వారికి సొంతింటి కల నెరవేరేనా! ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నగుట్ట ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలు గుడారాలు వేసుకొని ఎండ, వేడి ,చలి తీవ్రతను భరిస్తూ జీవనం గడుపుతున్నారు ఇప్పటికైనా అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు, ప్రజల గుండెల్లో కలకాలం నిలుస్తుంది కాబట్టి తక్షణమే పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి సకాలంలో గుడిసే వాసులకు అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version