టెస్కో టెండర్ విధానం వెంటనే రద్దు చేయాలి…

టెస్కో టెండర్ విధానం వెంటనే రద్దు చేయాలి

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు జీవనాధారమైన చేనేత పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ అన్నారు.

టెస్కో అమలు చేస్తున్న టెండర్ విధానం వల్ల చేనేత కార్మికులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.టెండర్ విధానం కారణంగా ధరల పోటీ పెరిగి మధ్యవర్తులు తక్కువ ధరలకు టెండర్‌లు పొందుతున్నారని తెలిపారు.

దీని ప్రభావం నేరుగా చేనేత కార్మికులపై పడుతూ వారికి దక్కాల్సిన కూలి తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్మికులకు తగిన పారితోషికం అందక వారి జీవనోపాధి సంక్షోభంలో పడుతోందని అన్నారు.
అలాగే టెండర్ విధానం వల్ల మధ్యవర్తులు, పెద్ద కాంట్రాక్టర్ల ప్రాధాన్యం పెరిగి చేనేత కార్మికులు నేరుగా ప్రభుత్వ సంస్థలతో పనిచేసే అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలిపారు.

చిన్న చేనేత సహకార సంఘాలు పోటీలో నిలబడలేక ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సరైన ఆదాయం లేకపోవడం వల్ల యువత చేనేత వృత్తి నుంచి దూరమవుతున్నారని, ఇది కొనసాగితే సంప్రదాయ చేనేత వృత్తి క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని క్యాతం సతీష్ కుమార్ హెచ్చరించారు.
ప్రభుత్వం టెస్కో టెండర్ విధానాన్ని వెంటనే పునఃపరిశీలించి చేనేత కార్మికులకు న్యాయమైన ధరలు కల్పించడంతో పాటు చేనేత సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ,చేనేత పరిశ్రమను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

స్టోన్ క్రషర్ పర్మిషన్ రద్దు చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు…

స్టోన్ క్రషర్ పర్మిషన్ రద్దు చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ పర్మిషన్ రద్దు చేయాలి కొత్తగా వచ్చే క్రషర్ టెండర్ ను పర్మిషన్స్ ఇవ్వకూడదని కలెక్టర్ కి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు మాట్లా డుతూ గత 13 సంవత్సరా లుగా శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ వల్ల చాలా వ్యవసాయం లోని పంట పొలాలలో పెద్దపె ద్ద బండలు ఒక కింటన్ పెద్ద బండలు పంట పొలాలలో పడడం జరిగి పూర్తిగా నాశ నం అవుతున్నది ఏర్పడి శబ్ద కాలుష్యం డాంబర్ ప్లాంట్ వలన వచ్చే వాసన వలన గ్రామంలోని ప్రజలు శ్వాస కోస వ్యాధులు వచ్చే అవకా శం ఏర్పడి వాయు కాలుష్యం వలన పంటలు దెబ్బతినడం జరుగుతుంది అలాగే గ్రామం లోని ఇల్లు పిల్లర్ల నుండి స్లాబ్ వరకు పగుళ్లు ఏర్పడి కూలి పోయే ప్రమాదం ఉన్నందున అలాగే గుట్టల్లో నివసించే జీవ రాశులు శబ్దాల వలన కోతు లు అడవి పందులు పంటలపై పడి పంటలు పూర్తిగా నాశనం చేస్తున్నాయని అలాగే గ్రామం లోని ఇళ్లకు గుట్టలలో నివసిం చే జీవరాశులు రావడంతో గ్రామ ప్రజలు నానా ఇబ్బం దులు పడుతున్నారని కావున శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషన్ పర్మిషన్స్ ను రద్దు చేయాలని అలాగే కొత్త టెండర్ వేస్తున్న టువంటి క్రషర్ ఏర్పాటును విరమించుకోవాలని వీటిపై ఎమ్మార్వో , ఆర్డీవో , కలెక్టర్ ఫిర్యాదుచేయడం జరిగింది కావున అధికారులు స్పందిం చి పత్తిపాక గ్రామాన్ని పొల్యూ షన్ ద్వారా కాపాడాలని మా గ్రామ పంచాయతీ పాలకవర్గం నుండి అధికారులను కోరుతు న్నాము ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకే శ్వరపు సాయి లక్ష్మి, కొడి మాల మహేందర్, గజ్జి రమే ష్, గడ్డమీది హారతి కర్ణాకర్, చిట్టి రెడ్డి పద్మ జంగారెడ్డి, ఐర బోయిన స్వప్న రాజు, కంద గట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు, నాయకులు పెండేల కిరణ్, పోతుగంటి సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version