భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి-ఎస్ఎఫ్ఐ…

భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి-ఎస్ఎఫ్ఐ

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని గౌట్ బాయ్స్ హై స్కూల్లో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం తమ నవయవ్వన జీవితాన్ని సైతం త్యాగం చేసిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలని సమాజ రుగ్మతలు సమస్యలపై పోరాడాలని పేర్కొన్నారు.వారు తృణప్రాయంగా తమ ప్రాణాలను వదిలారని బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా వారి పోరాటమే మనకు స్ఫూర్తిదాయకమని మనస్పూర్తితో పెట్టుబడిదారీ విధానాలకు విద్యా ప్రవేటికనకు విద్యార్థులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సురేందర్,టీచర్స్,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version