మేదపల్లి గ్రామంలో కరెంటు గోసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు…

మేదపల్లి గ్రామంలో కరెంటు గోసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ పాటిల్ తెలిపారు. రోజుకు పలుమార్లు కరెంటు పోవడంతో గృహ అవసరాలు, రైతుల వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని అన్నారు. సమయంలో కూడా విద్యుత్ సరఫరా సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version