పనికర లో హనుమాన్ నగర సంకీర్తన.

పనికర లో హనుమాన్ నగర సంకీర్తన

నెక్కొండ నేటి ధాత్రి:

నెక్కొండ మండలం పనికర లో మంగళవారం ఆంజనేయ స్వామికి విశిష్టమైన రోజుగా భావించి గ్రామంలోని హనుమాన్ మాలాధారులు గ్రామంలో ఉదయం 8 గంటల నుండి నగర సంకీర్తన చేసి గ్రామంలోని అన్ని దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. గురు స్వాములు చాట్ల సారంగం ,సముద్రాల అనిల్ ,ఘనగాని మధు, ల ఆధ్వర్యంలో హనుమాన్ మాల ధరించిన పత్రిక విలేకరులు కొత్త రవీందర్ రెడ్డి ,దేసూ.లక్ష్మణ్ , లు ఈ శోభ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామంలో 30 నుండి 50 మంది స్వాములు హనుమాన్ దీక్ష తీసుకుంటారని నియమనిష్ఠలతో ఇరు సంధ్యలు చన్నీళ్లస్నానాలు ఆచరించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీక్ష ఎంతో కష్టమైనదని స్వామి వారి ఆశీస్సులతో ఏ కష్టం లేకుండా కొనసాగుతున్నాదని గురు స్వాములు తెలిపారు. సుమారు 6 గంటల నగర సంకీర్తన పూర్తి చేశారు. అనంతరం పూజారి బూరుగుపల్లి భవిశాస్త్రి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి ఇరుముడులు ఎత్తుకొని స్వాములు స్వామివారి సన్నిధికి వెళ్ళిపోయారు .ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు బుర్ర సతీష్, రాచకొండ యాదగిరి, పైండ్ల మధు, మెండే కుమారస్వామి,కోల సతీష్, దామెర కొండ లక్ష్మీనారాయణ, పవన్ , తరుణ్ ,ప్రవీణ్, హరీష్ ,దీక్షిత్ రెడ్డి, రాము, శ్రీకాంత్ ,అభి, స్వామివారి సన్నిధికి వెళ్ళిపోయారు.

రామనామ స్మరణంతో నగర సంకీర్తన.

రామనామ స్మరణంతో నగర సంకీర్తన.

చిట్యాల నేటి ధాత్రి :

చిట్యాల మండల కేంద్రం లో వెంకట్రావుపల్లి సి గ్రామం లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం లో హనుమాన్ మాలదారులు శనివారం గ్రామం లో నగర సంకీర్తన కార్యక్రమం* ని అంగరంగ వైభవం గా నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములు గ్రామం లోని అన్ని పురావిధుల గుండా హనుమాన్ వేశాధారణలో రామనామా స్మరణ చేస్తు డీజే చప్పుళ్లతో అంజన్న స్వామి ల గంతులు వేస్తూ హంగామా చేశారు. అదే విధంగా రామ నమా స్మరణ తో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో దేవస్థానం గురుస్వాములు ఈగ కోటి, బ్రాహ్మం, మాసు రమేష్, చారి, అంకం రమేష్, కొక్కుల కరుణాకర్, చిలుకల సదానందం,జంగపల్లి సతీష్,అంకం సదానందం,కన్నె స్వాములు సతీష్, ప్రవీణ్, నాగరాజు, నగేష్, సురేష్, బిట్టు దేవస్థాన హనుమాన్ స్వాములు,తదితరులు పాల్గొన్నారు.

రంగులమయంగా 145 వ నగర సంకీర్తన.

రంగులమయంగా 145 వ నగర సంకీర్తన.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతంలో ఆదివారం జరిగిన 145 వ నగర సంకీర్తన రంగులమయంగా జరిగింది. అత్యంత వైభవంగా కొనసాగిన సంకీర్తన కార్యక్రమంలో భక్తులు శ్రీ కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ శోభయాత్ర జరిపారు. చిన్నారులు, మహిళలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు శ్రీ కృష్ణ గీతాలకు నృత్యాలు చేస్తూ ఆనంద పరవశంలో మునిగితేలారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version