మేడారానికి “యునెస్కో” గుర్తింపు మంత్రి సీతక్క తోనే సాధ్యం…..
మేడారం జాతర విజయవంతంలో మంత్రి సీతక్క కృషి ఎనలేనిది…
* కలెక్టర్, ఎస్పీ మరియు అధికారులందరికి అభినందనలు….
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…
మంగపేట నేటిధాత్రి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర మునిపెన్నడూ లేని విధంగా విజయవంతమైందని జాతర విజయవంతం కావడంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కృషి ఎనలేనిదని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళ వారం స్థానిక విలేఖరులతో సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి బావితరతరాలకు గుర్తుండే విధంగా వేయి సంవత్సరాల చరిత్రను నిర్మించిన మహనీయురాలు మంత్రి సీతక్క అన్నారు జాతర నిర్వహణలో మంత్రి సీతక్కకు వచ్చిన మంచి పేరును తట్టుకోలేని కొందరు రాజకీయ కుట్రలకు పాల్పడడం విచారకరమన్నారు ప్రపంచ దేశాల నుండి భక్తులు వచ్చి మేడారం జాతర అద్భుతం అని కితాభిస్తుంటే స్థానిక ప్రతిపక్షాలు జీర్నించుకోలేకపోతున్నాయన్నారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా సీతక్క ప్రతిష్టను తగ్గించలేరన్నారు మేడారం జాతరపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాను మరియు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు దుష్ప్రచారం చేసే వ్యక్తులు లేదా వ్యవస్థల పట్ల తాము క్షమా గుణం కలిగి ఉన్నా సమ్మక్క సారలమ్మలు వారికి తగిన శాస్తి చేస్తారని అన్నారు రాబోయే రోజుల్లో మేడారం జాతరకు యూనిస్కో గుర్తింపు తీసుకురావడం సీతక్కతోనే సాధ్యమని సాంబశివరెడ్డి అన్నారు పదిహేను రోజులపాటు కారోబార్ నుండి కలెక్టర్ వరకు వేలాదిమంది సిబ్బంది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ అహర్నిశలు కష్టపడి పనిచేసి మేడారం మహ జాతరను విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరున అభినందనలు తెలిపారు
