రోడ్డు భద్రత-జీవన రక్షణ, హెల్మెట్ ధరించు-ప్రాణాలు కాపాడు.
గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై గోపాల్ రెడ్డి
కోదాడ, నేటి ధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ. ఆరైవ్-ఆలైవ్ నినాదంతో రోడ్డు ప్రమాదాలు నివారణ హెల్మెట్, సీట్ బెల్ట్, ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో ప్రజలు వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడంలేదని రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలు రక్షించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాల వీధిన పడుతున్నాయని ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్ళింది మొదలు ఇంటికి వచ్చేవరకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ. స్థానిక పోలీస్ సిబ్బంది గ్రామస్తులు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత నియమ అంశాల తెలియజేస్తూ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని. కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని. మితిమీరిన వేగంతో వెళ్లకూడదని అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలకు యువతకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, వర్క్ ఇన్స్పెక్టర్ ఈసి, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువకులు, మహిళలు గ్రామ ప్రజలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
