కల్వకుర్తిలో బీజేపీ నేత హెచ్చరిక

కల్వకుర్తి జిల్లా ప్రకటిస్తే మున్సిపల్ ఎన్నికల్లో నుంచి తప్పుకుంటామన్న బిజెపి నేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో, ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆర్డీవో, సబ్ రిజిస్టర్, ఎస్ టి ఓ, ఆర్టీవో కార్యాలయా లను ఏర్పాటు చేస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పోటీ చేయమని బీజేపీ నేత, జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే బీజేపి లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోని కల్వకుర్తి భవిష్యత్తును మార్చాలని తల్లోజు ఆచారి విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version