జోరుగా ఎర్రరాయి తవ్వకాలు.. చర్యలెక్కడ..,.

జోరుగా ఎర్రరాయి తవ్వకాలు.. చర్యలెక్కడ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గణేషాపూర్లో
కర్ణాటక వ్యక్తితో కలిసి కొందరు అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు రవాణా చేస్తున్నారు. ఆర్డీవో ఆదేశించినా న్యాల్కల్ తహశీల్దార్ చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులతో పాటు తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

అక్రమ తవ్వకాలు ఆపేవారే లేరా…

అక్రమ తవ్వకాలు ఆపేవారే లేరా!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: నాల్కల్ మండలం గణేషాపూర్లో కొందరు అక్రమార్కులు కర్ణాటకకు చెందిన వ్యక్తితో కలిసి ఎర్రరాయి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారని గతంలో పలువురు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే తవ్వకాలు ఆపించి వారిపై కేసు నమోదు చేయమని నాల్కల్ తహశీల్దార్కు.. ఆర్డీవో ఫోన్ చేసి ఆదేశించినా.. ఎమ్మార్వో చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version