సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన..

సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన

బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండటం అత్యంత దురదృష్టకరమని దుమాల శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ, సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇళ్లను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇలడ్లు నిర్మాణం జరిగినవి అంతకుముందు ఇదే స్థలంలో ఎస్సీ కులస్తులకు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారు. ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే సితిలావస్థకు చేరే పరిస్థితి.
గతంలో ఈ ఇళ్లను మొదటగా ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే అప్పుడు డబల్ బెడ్ రూమ్ ల పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారు అందులో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండిపడ్డారు.
కిరాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేనిపక్షంలో ఇవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయించాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని దుమాల శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాని శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు వర్ణాల శేఖర్ బాబు అభి కనుకయ్య దేవరాజు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సిరిసిల్ల గడ్డపై ఎగిరింది గులాబీ జెండా..

సిరిసిల్ల గడ్డపై ఎగిరింది గులాబీ జెండా..

ప్రజాధనం ఎవరి అత్త సొమ్ము కాదు: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు

 

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ‘ఆత్మీయ సమ్మేళనం’లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను అభినందించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు సమరశంఖం పూరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని సిరిసిల్ల నియోజకవర్గంలోని 117 గ్రామ పంచాయతీలకు గాను 80 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాలు తిరిగినా, ప్రలోభాలకు గురిచేసినా క్షేత్రస్థాయిలో ప్రజలు కేసీఆర్ నాయకత్వం వైపే మొగ్గు చూపారని ఆయన వివరించారు. ముఖ్యంగా గంభీరావుపేట వంటి మండలాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్పంచులను బెదిరించడంపై స్పందిస్తూ, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అని, అది ఎవరి అత్త సొమ్ము కాదని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను ఆపే అధికారం ఏ ఎమ్మెల్యేకు గానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ లేదని స్పష్టం చేశారు. “ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వం, నిధులు ఆపేస్తాం” అని చిల్లర మాటలు మాట్లాడే వారిని ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.

గత పదేళ్లలో కేసీఆర్ ‘పల్లె ప్రగతి’ ద్వారా గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దారని, నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఈడీ బల్బులు మార్చే దిక్కు లేక పల్లెలు చీకటిమయమవుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాన్ని చూసి భయపడే రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టి, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట కోసం కార్యకర్తలంతా ఐకమత్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 117 పంచాయతీల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలను క్లస్టర్ల వారీగా సమీక్షించుకొని గెలుపు దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నాయకులకు సూచించారు. గెలిచిన ప్రజాప్రతినిధులకు సంక్రాంతి తర్వాత వారి హక్కులు, బాధ్యతలపై ప్రత్యేక శిక్షణ (Workshops) ఏర్పాటు చేస్తామని, పార్టీ వారికి కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు మరియు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version