వనపర్తి లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు రాని పేద విలేకరుల కు న్యాయం చేయాలి…

వనపర్తి లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు రాని పేద విలేకరుల కు న్యాయం చేయాలి

వనపర్తి నేటిదాత్రి

వనపర్తి లో బ్లాక్ మెయిల్ విలేకరుల వల్ల నిజాయితీగా పనిచేసే విలేకరులకు చెడ్డ పేరు వస్తుందని నిజాయితీపరు ప్రజలు అంటున్నారు గతంలో కొత్తకోట రోడ్డులో ఒక హోటల్లో ఒక విలేకరి ని యువకులు చితక బాదినట్లు అప్పట్లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయినట్లు తెలిసింది చట్టంలో అందరు సమానులేనని చట్టాన్ని కోర్టును గౌరవించాలని చట్టానికి చుట్టం ఎవరు కాదని తప్పు చేస్తే కోర్టులో నిలబడాల్సిందేనని పలువురు అంటున్నారు వనపర్తి చందాపూర్ రోడ్డులో శ్రీనివాసపూర్ శివారులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 55 సర్వే నెంబర్లు వనపర్తి విలేకరులకు పట్టాలు పంపిణీ చేసింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విలేకర్ల సంఘాల నేతల సిఫారస్ చేసినవారికి ఇళ్ల స్థలాలు కేటాయించార ని జిల్లా బీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీదర్ అప్పట్లో పత్రిక ప్రకటన చేశారు కొంతమంది విలేకరులకు తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వంలో విలేకరులకు రాజనగరం జర్నలిస్టు కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలు పొందారని తెలిసింది కొందరు జర్నలిస్ట్ కాలనీలో విలేకరులు ఇల్లు నిర్మించుకున్నారు చిట్యాల రోడ్ లో కొంతమంది విలేకరులకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ లో పొందినట్లు ప్రభుత్వ ప్లాట్లు డబుల్ బెడ్ రూమ్ పొందని నిరుపేద విలేకరులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుండి దాదాపు 40 మంది విలేకరులు ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు పొందని వారు ఉన్నట్లు తెలిసింది టిఆర్ఎస్ ప్రభుత్వం లో అప్పట్లో నిరుపేద విలేకరి రమేష్ అప్పటి కలెక్టర్ ఇళ్లస్థలం కేటాయింనందుకు వనపర్తి కలెక్టర్ ప్రజావాణిలో అప్పటి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఫిర్యాదు చేశారు వివిధ దినపత్రికలలో వార్త పబ్లిష్ ఆయనది అప్పట్లో విలేకరులు రమేష్ సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ శ్రీనివాస్ మరి కొందరికి ఇళ్ల పట్టాలు మాజీ మంత్రి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పట్టాలు ఇచ్చారు వనపర్తి లో విలేకరుల సంఘాలు ఐకమత్యం లేనందు వల్ల నిజాయితీగా పనిచేసే విలేకరులకు గుర్తింపు లేకుండా పోయిందని పలువురు అంటున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విలేకరుల సంఘాల నేతల విలేకర్ల పేర్లు సిఫారస్ మేరకు శ్రీనివాసపూర్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇళ్ల స్థలాలు పట్టాలు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిందని అప్పట్లో విలేకరుల సమావేశంలో పత్రికా ప్రకటనలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది . 55 సర్వే నెంబర్లు కొంతమంది విలేకరులు ఇళ్ల స్థలాల పట్టాలు కేటాయించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఎన్నికల ముందు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విలేకరులకు అందరికీ వనపర్తి ఎమ్మెల్యే గా తూడి మెగా రెడ్డి విజయం సాధించిన తర్వాత ఇళ్ల స్థలాలు రాని విలేకరుల అందరికీ ఇళ్ల స్థలాలు రావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అప్పట్లో ప్రచారం జరిగింది వనపర్తి లో ఇళ్ల స్థలాలు గాని ప్రభుత్వ హెల్త్ కార్డులు జిల్లా కలెక్టర్ డి పి ఆర్ ఓ ద్వారా కమిటీ ఏర్పాటుచేసి విలేకరిగా పని చేస్తున్నారా లేదా అని గుర్తించి విచారణ చేసి విలేకరులకు న్యాయం చేయాలని పలువురు విలేకరులు ఎలక్ట్రాని ప్రింట్ మీడియా విలేకరులు అంటున్నారు వనపర్తి లో పేద విలేకరులు ఇళ్ల స్థలాలు పొందని విలేకరులు ఉన్నారని వారిని గుర్తించాలని పలువురు విలేకరులు అంటున్నారు గతంలో ఇళ్ల స్థలాలు తెల్ల రేషన్ కార్డ్ ఆధారంతో పొందిన విలేకరులు ఉన్నారని వారు ఇళ్ల పట్టాలు పొందారని విలేకరులు అంటున్నారు ప్లాట్లు రాని విలేకరులకు కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి స్పందించి ప్లాట్లు రాని పేద విలేకరులకు న్యాయం చేయాలని ప్లాట్లు రాణి విలేకరులు అంటున్నారు ప్లాటు రాని జర్నలిస్ట్ హైదరాబాద్ ముఖ్యమంత్రి ప్రజా భవన్ లో దరఖాస్తు ఇచ్చినట్లు తెలిసింది రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సిఫార్సు చేసిన లెటర్ వనపర్తి ప్రజావాణి జిల్లా కలెక్టర్ కార్యాలయం వనపర్తి లో జర్నలిస్ట్ ఇచ్చారని తెలిసింది ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కార కాలేదని జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు

సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన..

సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన

బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండటం అత్యంత దురదృష్టకరమని దుమాల శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ, సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇళ్లను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇలడ్లు నిర్మాణం జరిగినవి అంతకుముందు ఇదే స్థలంలో ఎస్సీ కులస్తులకు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారు. ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే సితిలావస్థకు చేరే పరిస్థితి.
గతంలో ఈ ఇళ్లను మొదటగా ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే అప్పుడు డబల్ బెడ్ రూమ్ ల పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారు అందులో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండిపడ్డారు.
కిరాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేనిపక్షంలో ఇవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయించాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని దుమాల శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాని శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు వర్ణాల శేఖర్ బాబు అభి కనుకయ్య దేవరాజు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version