గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్…

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నిషేధిత చైనీస్ మాంజ ను ఉపయోగించి గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలైన ఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్ కాలనీలో చోటు చేసుకుంది. బీహార్ ప్రాంతానికి చెందిన నిరాజ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు పట్టణ పరిధిలోని స్థానిక పరిశ్రమలలో పని చేసుకొంటూ సంక్రాంతి పండుగ ను ఆస్వాదించేందుకు గురువారం మధ్యాహ్నం సమయంలో తాము అద్దె కు ఉన్న ఇంటి పైన గాలి పటాలు నిషేధిత చైనీస్ మాంజ తో ఎగురిస్తున్న క్రమంలో చైనీస్ మంజ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బీహార్ యువకులకు విద్యుత్ షాక్ తగిలిందాన్న విషయన్ని తెలుసుకోన్న బిఅర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ స్పందించి బాధితులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ శికిత్స చేసి మెరగైన వైద్య సేవలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి,

విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి,

నేటి ధాత్రి, మొగుళ్లపల్లి:

మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో తోకల లక్ష్మయ్య అనే రైతుకు సంబంధించిన ఆవుమొట్లపల్లి పల్లె ప్రకృతి వనం వద్ద నున్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు ప్రమాదానికి గురై ఆవు అక్కడికక్కడే మృతి చెందింది సుమారు 50 వేల రూపాయల ఆవు మృతి చెందడంతో రైతు తోకల లక్ష్మయ్య ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version