జహీరాబాద్ లో లక్ష విలువైన చైనీస్ మాంజా సీజ్

జహీరాబాద్ లో లక్ష విలువైన చైనీస్ మాంజా సీజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో లక్ష రూపాయల విలువైన నిషేధిత చైనీస్ మాంజా రీల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గడి మహల్లాలోని ఓ గోదాం నుండి ఈ మాంజాను సీజ్ చేశారు. ఈ ఘటనలో అజీమ్, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు. నిషేధిత మాంజా అమ్మినా, నిల్వ ఉంచినా, వాడినా చట్టపరమైన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్. శివలింగం హెచ్చరించారు. గత వారం రోజులుగా పోలీసులు ఈ మాంజాపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్…

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నిషేధిత చైనీస్ మాంజ ను ఉపయోగించి గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలైన ఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్ కాలనీలో చోటు చేసుకుంది. బీహార్ ప్రాంతానికి చెందిన నిరాజ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు పట్టణ పరిధిలోని స్థానిక పరిశ్రమలలో పని చేసుకొంటూ సంక్రాంతి పండుగ ను ఆస్వాదించేందుకు గురువారం మధ్యాహ్నం సమయంలో తాము అద్దె కు ఉన్న ఇంటి పైన గాలి పటాలు నిషేధిత చైనీస్ మాంజ తో ఎగురిస్తున్న క్రమంలో చైనీస్ మంజ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బీహార్ యువకులకు విద్యుత్ షాక్ తగిలిందాన్న విషయన్ని తెలుసుకోన్న బిఅర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ స్పందించి బాధితులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ శికిత్స చేసి మెరగైన వైద్య సేవలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్)పై కఠిన నిషేధం –వర్దన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరిక…

చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్)పై కఠిన నిషేధం –వర్దన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరిక
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

ప్రభుత్వం మరియు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రకారం చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్) తయారీ, విక్రయం, నిల్వ మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడిందని వర్దన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సాయిబాబు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎస్సై సాయిబాబు మాట్లాడుతూ, చైనా మంజా అత్యంత పదునుగా ఉండటంతో రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సైకిల్ ప్రయాణికులు, పాదచారులు తీవ్ర గాయాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు గతంలో అనేక చోట్ల ఈ నైలాన్ మంజా కారణంగా గొంతు కోసుకుపోయిన ఘటనలు ప్రాణ నష్టం సంభవించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు అలాగే చైనా మంజా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ లైన్లకు చుట్టుకుపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుందని, కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు దీంతో ప్రజలకు ఆర్థిక నష్టం ప్రాణాపాయం కూడా ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చైనా మంజా వాడకుండా కట్టడి చేయాలని, పండుగలు సెలవుల సమయంలో పిల్లలు సురక్షితమైన కాగితపు మంజా మాత్రమే ఉపయోగించేలా చూడాలని సూచించారు. అలాగే వ్యాపారులు ఎవరైనా నిషేధిత మంజాను విక్రయిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి, ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సాయిబాబు కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని, నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version