పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్…

పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్

పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్

పరకాల,నేటిధాత్రి

పరకాల మున్సిపాలిటీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సునీల్ కుమార్‌ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్‌లను కూడా ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా చైర్మన్ పావుశెట్టి సునీల్ మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసంతో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి లక్ష్యమని తెలిపారు.పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి,పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం,రోడ్ల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు.పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన అనుచరులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ సునీల్ కుమార్ నాయకత్వంలో మున్సిపాలిటీ ముందుకు సాగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వనజ రాజేష్ ను ఆశీర్వదించండి…

వనజ రాజేష్ ను ఆశీర్వదించండి

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా టిటి కోటర్స్ కారన్ మాస్ కాలనీ లో గొడుగు వనజ రాజేష్ స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రెండు సార్లు పోటీ చేసి కౌన్సిలర్ గా ఓడిపోయాను కావున కాలనీ ప్రజలు అందరూ ఆలోచించి ఈసారి నన్ను మున్సిపాలిటీ కౌన్సిలర్ గా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

13వ వార్డు అభ్యర్థి బొచ్చు మాధవి లత ప్రచారం…

13వ వార్డు అభ్యర్థి బొచ్చు మాధవి లత ప్రచారం

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొచ్చు మాధవిలత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను కలిసి ఆశీర్వాదం కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతామని తాగునీరు,డ్రైనేజీ,రోడ్లు,వీధి దీపాల సమస్యలు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

వార్డు ప్రచారంలోఏకు దివ్య విద్య సాగర్

పరకాల,నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఏకు దివ్య -విద్య సాగర్ వార్డులో ఇంటింటా తిరుగుతూ తమను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలనే సంకల్పంతో,వార్డు అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా,నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే ఆశయంతో తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ప్రజలతో నేరుగా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. 20వ వార్డులో మౌలిక వసతుల వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి,4వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version