ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు….

ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

◆”-: రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మార్చ్ 26: పెట్రోల్, డీజిల్ కొరత వదంతుల్లో వాస్తవం లేదని, ఇంధన సరఫరాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని బారులు తీరవద్దని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఎస్సై పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version