ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి…

ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి

* మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మూడు చింతలపల్లి పాలకవర్గం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే అన్ని రంగాల్లో అభివృద్ధిని చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ జామ్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖ లతో పాటు కౌన్సిలర్లు బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా మూడు చింతలపల్లి అభివృద్ధి కోసం అన్ని విధాల తోడ్పాటు అందించాలని పాలకవర్గ సభ్యులకు కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అనిత, మాజీ సర్పంచ్ ఇస్తారి, మాజీ ఎంపిటిసి నాగరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, మురళి గౌడ్, సంజీవ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

 భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. ఉద్రిక్తత

 

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లా రెడ్డి (Malla Reddy), మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇక భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈరోజు (మంగళవారం) అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version